కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కరోనా కేసులను తగ్గించడానికే రాష్ట్రంలో తక్కువ పరీక్షలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏపీ లో 80 వేల టెస్టులు జరిగితే, ఇక్కడ 19 వేల టెస్టులు మాత్రమే జరిగాయన్నారు. కరోనా టెస్టుల విషయంలో అనుమానాస్పద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రతీ కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలన్నారు. పసుపు, బత్తాయి, నిమ్మ, మామిడి విషయంలో మార్కెట్ ఇంట్రవెన్షన్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.