శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం !

ఏదైనా ఒక మంచి రోజు .. రాత్రి 10 గంటల తరవాత ఎదురుగా బల్లపై ఒక కలశం ఉంచాలి. ఈ కలశంపై కుంకుమపువ్వుతో ఒక స్వస్తిక గుర్తును చిత్రించి, అందులో నీరు నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షతలు ఒక రూపాయి నాణెం వేయాలి. తరవాత చిన్నపళ్లెంలో బియ్యం పోసి, ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర నాలుగు ముఖాల దీపం వెలిగించి అక్షతలు, కుంకుమతో పూజించాలి.

అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిముషాలు ధ్యానించాలి. ఆ గృహంలో ధన సంబంధ సమస్యలు తొలగి, ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది. అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడల్లా పేదలకు, ఐదురూపాయల అన్నం పెట్టే దగ్గర మీ చాతనైనంత సహాయం చేయండి. వికలాంగులు, వీధులు ఊడ్చేవారు కనపడితే- వారికి కొంత డబ్బులు ఇవ్వండి. దీనివల్ల కుటుంబంలో సుఖ సమృద్ధి. ప్రతీ శుక్రవారం శ్రీసూక్తపారాయణం, అది రానివారు శ్రీలక్ష్మీ అష్టోతరం చదవండి. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి.