దోసకాయ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక చెంచా దోసకాయ గింజలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దోసకాయ గింజల్లో కాల్షియం,ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
దోసకాయ గింజలను చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, తాజాగా ఉంచుతాయి. దీని పేస్ట్ను చర్మంపై అప్లై చేయడం వల్ల మచ్చలు, ముడతల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. దోసకాయ గింజల్లో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. దోసకాయ గింజలు డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.