News

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. జగన్ గురించి ఏం మాట్లాడాడో తెలుసా..?

Ap film corporation development chairman posani

ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ...

Read More »

ఏపీలోసంక్రాంతికి కోడిపందేల జోరు – కోట్ల రూపాయల బెట్టింగులు..!!

సంక్రాంతి సంబరాలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. అందులోనూ ముఖ్యంగా కోనసీమ. అక్కడ భోగిమంటలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు, బసవన్నలే కాదు వీటన్నింటికీ పోటీగా కోడిపందాలు కూడా జోరుగా సాగుతూంటాయి. యువకులంతా పందెం కోళ్లమీద బెట్టింగులాడుతూ బిజీగా ఉంటారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు అడపాదడపా నిషేధాజ్ఞలు విధించినా లోపాయికారీగా ఈ పందాలు జరిగిపోతూంటాయి. కొన్ని ప్రాంతాలలో వాటి కాళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి వదులుతుంటారు. పైగా ఈ పందేలను చూడడానికి డిజిటల్ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారట. కొంతమంది నిర్వాహకులు గొడవలు జరగకుండా ప్రవేటు బౌన్సర్లను కూడా ...

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్‌ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్‌ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 ...

Read More »

2023 డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామంలో జియో 5జీ సేవలు

డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్‌ ఇండిస్టీ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్‌ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై ...

Read More »

49వ సిజెఐగా యుయు లలిత్‌ ప్రమాణం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్ ఉమేష్‌ లలిత్‌( యుయు లలిత్‌) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవనలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, నవంబర్‌ 8 వరకు మాత్రమే అనగా కేవలం 74 రోజుల మాత్రమే సిజెఐగా ఉంటారు. ఆ సమయానికి ఆయనకు 65 ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ...

Read More »

విశాఖలో జగన్‌ పర్యటన

జగన్‌ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా ...

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

 ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్‌ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గురువారం ఉదయం షాహినాయత్‌ గంజ్‌, మంగళ్‌హట్‌ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రాజాసింగ్‌ ఇంటి వద్ద ...

Read More »

వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన జగన్‌

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను సిఎం జగన్‌ ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తికి సిఎం జగన్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ… ద్రవిడ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌

మరో 4 రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా … టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్‌ ద్రవిడ్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వుంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ ...

Read More »

చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ విడుదల

‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్‌ రీజన్‌ ఫర్‌ ఎవ్రీగాన్‌ థింగ్‌, కిల్‌ హిమ్‌’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్‌ ఫాదర్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ టీజర్‌ను విడుదల చేసింది. గాడ్‌ ఫాదర్‌ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా ...

Read More »