అదానీ, ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్..

ravanth-18.jpg

తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం చలో రాజ్ భవన్ పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్‌లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా పార్టీలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, పోలీసుల నిరాకరణ కారణంగా ర్యాలీ రాజ్ భవన్ వద్ద అడ్డుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ పోలీసులు నిరసనకారులను రాజ్ భవన్ దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, గవర్నర్ ఆఫీస్ చేరుకోలేకపోయామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

Share this post

scroll to top