భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ జెండా అయిన తిరంగాకి గౌరవాన్ని పెంచుతూ, ప్రజలలో దేశభక్తి భావాన్ని నాటడం లక్ష్యంగా బీజేపీ ఈ యాత్ర చేప్పట్టబోతుంది.
దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర..
