ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించిన తరుణంలో, సిజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, ఈ సినిమా నిన్నటికి రిలీజ్ కావాల్సి ఉంది, కానీ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను వచ్చే నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టారు, కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఆయన తప్పుకోవడంతో, నిర్మాత ఏ.ఎమ్. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించి సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఇప్పుడు రిలీజ్కు సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ అయితే, ఈ నెల మొత్తం బాక్స్ ఆఫీస్ కాస్త డల్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాబిన్ హుడ్గా పేరున్న పండుగ సాయన్న బయోపిక్గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. మొగల్ కాలంలో వారిని ఎదిరించి, దోచి, పేదలకు పంచిపెట్టాడని ప్రచారం ఉంది. ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయాడని అంటున్నారు. మొత్తానికి, ఈ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించే వరకు నమ్మలేం. అధికారికంగా ప్రకటించినా, సినిమా రిలీజ్ అయ్యే వరకు వస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి.