బిగ్ బాస్ సీజన్ 8 తుది సమరం రసవత్తరంగా మారింది. విన్నర్ ఎవరో తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శనివారం ఎపిసోడ్లో రోహిణి ఆదివారం నాటి ఎపిసోడ్లో విష్ణు ప్రియలు ఎలిమినేట్ కావడంతో మిగిలిన ఐదురుగు అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్లు టాప్ 5 ఫైనలిస్ట్లుగా నిలిచారు.
ఇక ఈ ఐదుగురిలో విన్నర్ని తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్కాగా వార్ వన్ సైడ్ కాదు వార్ టూ సైడ్ అన్నట్టుగా మారింది. రేస్లో మొత్తం ఐదుగురు ఫైనలిస్ట్లు ఉన్నా కూడా ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అయ్యింది తొలిరోజు. ఆ ఇద్దరే నిఖిల్, గౌతమ్. తొలిరోజు ఓటింగ్లో ఈ ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. పుష్ప 2 కలెక్షన్స్ మాదిరిగా ఓట్ల సునామీ సృష్టిస్తున్నారు. అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే అన్ అఫీషియల్ పోల్స్లో మాత్రం నిఖిల్-గౌతమ్ ఇద్దరూ హోరా హోరీగా ఓటింగ్ సాధిస్తున్నారు. కొన్ని పోల్స్లో నిఖిల్ ముందుంటే మరికొన్ని పోల్స్లో గౌతమ్ ముందున్నాడు. మొత్తం ఓటింగ్లో 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుండటంతో మిగిలిన ముగ్గురూ రేస్లో నామమాత్రంగానే ఉన్నారు.