ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ నేతలు..

phone-17.jpg

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 400 నుంచి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు వెలుగులోకి రావడంతో సాక్షులు, బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇవాళ ఉదయం ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌‌లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి సరిత హాజరయ్యారు. వారి నుంచి సిట్ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో సాక్షులు, బాధితుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top