కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి నోరు జారిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి నవ్వుల పాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేను అలాగే ఎంపీలను గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే అలాగే ఎంపీలను గెలిపించుకోవాలని ఆశయం పెట్టుకున్నాను అంటూ బాంబు పేల్చారు ఝాన్సీ రెడ్డి. దీంతో ఝాన్సీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే అలాగే ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటారని సెటైర్లు పేల్చుతున్నారు. ఆ మాత్రం తెలియకుండా ఝాన్సీ రెడ్డి రాజకీయాలు ఎలా చేస్తున్నారని చురకలు అంటిస్తున్నారు. అందుకే ఇన్ని రోజులపాటు ఎర్రబెల్లి దయాకర్ పైన ఓడిపోయింది అంటూ ఝాన్సీ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.
నోరు జారిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి..
