మాల్దీవ్స్ దేశానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్..

kathirna-kaif-11-1.jpg

బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. ఆమె 2003 చిత్రం బూమ్ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు అందాల పోటీ విజేత. ఫ్యాషన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక ఇప్పుడు మాల్దీవ్స్ దేశానికి ప్రపంచ రాయబారిగా ఎంపికైంది. మాల్దీవులు మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఇటీవల ఈ ప్రకటన చేసింది. కత్రినా చివరిసారిగా విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. 2019 లో ఆమె తన సొంత కాస్మెటిక్ బ్రాండ్ కే బ్యూటీని పరిచయం చేసింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 224 కోట్లు. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‏మెంట్స్ బిజినెస్ రంగంలో రాణిస్తుంది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరో విక్కీ కౌశల్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. చివరగా మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. తెలుగులో కత్రీనా కేవలం మళ్లీశ్వరి అనే చిత్రంలో నటించింది. ఇందులో వెంకటేశ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కత్రీనా. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కత్రీనా వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 10-12 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. సంవత్సరానికి రూ.30 కోట్లు సంపాదిస్తుంది. ఆమెకు లండన్‌లో దాదాపు రూ. 7 కోట్ల విలువైన బంగ్లా ఉంది.

Share this post

scroll to top