సత్యమేవ జయతే..

ys-13.jpg

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అక్ర‌మ అరెస్టు సుప్రీం కోర్టు తీర్పు ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఈ కేసులో సరిగ్గా ఇదే​ జరిగిందని, స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ఆయ‌న ట్వీట్  చేశారు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్ర‌బాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం. 

Share this post

scroll to top