india-09.jpg

పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు తెలిపింది. మీ నిస్వార్థ సేవలు, ధైర్య సాహసాలే మన జాతికి బలం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ల మీ సేవలను మరువలేం. మీరు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ తెలిపింది. పాకిస్థాన్ చేస్తున్న దాడిని అడ్డుకుంటూ మనల్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేద్దాం అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు. వీరే కాకుండా ఇతర క్రీడాకారులు కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారు.

Share this post

scroll to top