కొత్త పార్టీ పెట్టడంపై కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన..

kavitha-31.jpg

కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడం ఏంటని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. జ్యుడీషియల్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు కవిత.

జూన్ 4న మహాధర్నా చేయబోతున్నామని కవిత తెలిపారు. జూన్ 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసన చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందన్నారు కవిత. శనివారం సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇక జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమ పోస్టర్ ను కవిత రిలీజ్ చేశారు. అనంతరం కేసీఆర్ కు నోటీసులా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి 18 సంవత్సరాలు కావొస్తోంది. తెలంగాణ సమాజంలోని ప్రతి వ్యక్తి తలలో నాలుకలా, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలా జాగృతి సంస్థ కలిసి ఉంది. ఆనాడు ఇద్దరు వ్యక్తులతో పుట్టింది జాగృతి. ఒకరు కేసీఆర్, మరొకరు ప్రొఫెసర్ జయ శంకర్. రాజకీయ రంగంలో తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారని జయ శంకర్ చెప్పారు. అప్పుడే తెలంగాణ జాగృతి ఊపిరి పోసుకుంది. ఇప్పటివరకు అశోక్ నగర్ లో తెలంగాణ జాగృతి కార్యాలయం ఉండేది. ఈరోజు జాగృతి కార్యాలయం బంజారా హిల్స్ కి షిఫ్ట్ అయింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా.

Share this post

scroll to top