సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ఆమె అన్నారు. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు పై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎటువంటి సంబంధం లేదని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం రక్షణపై ఇది గట్టి సందేశం. సాక్షి టీవీ పై విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిది. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజాయితీపరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధం లాంటి తీర్పు అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సాక్షి టీవీ పై విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ..
