మోహన్‌ బాబు ఫ్యామిలీ హైడ్రామాపై మంచు మనోజ్‌..

machu-10.jpg

టాలీవుడ్ యాక్టర్‌ మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ వార్‌ కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే  మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది, ఈ ఘటనలో కాళ్లకు గాయాలవడంతో మంచు మనోజ్‌ బంజారాహిల్స్‌లోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చేరాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంచు మనోజ్‌, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నా భార్యాపిల్లలకు రక్షణ ఉండేందుకే బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరా. పోలీసులను ప్రొటెక్షన్‌ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానన్నాడు. నేను డబ్బు కోసమే, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నాడు. .

Share this post

scroll to top