మరికాసేపట్లో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఉదయం 11గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే, దీనిపై పేద, మధ్యతరగతి, వేతనజీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ లో యువత, మహిళల కోసం ఎలాంటి పథకాలను కేంద్రం ప్రకటించబోతున్నారు? వ్యవసాయ రంగం, రైతులపై ఎలాంటి వరాలను కురిపిస్తారు. ఉదయం 11గంటలకి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2025 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై వేతన జీవుల్లో పెరుగుతున్న ఆశలు ట్యాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3కి కుదించే అవకాశం గరిష్ట పన్ను రేటు 30 నుంచి 25 శాతానికి తగ్గించే ఛాన్స్ స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ పెంచే అవకాశం పీఎం సూర్య ఘర్ బిజ్లీ పథకానికి కేటాయింపులు పెంచే ఛాన్స్.
పేద, మధ్యతరగతి వారిని నిర్మలమ్మ కరుణించేనా..
