మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీస్ భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెడుతున్న వైయస్ జగన్కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు ఉద్దేశపూర్వకంగా భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైయస్ జగన్ పొదిలి పర్యటనలో పోలీస్ భద్రతా వైఫల్యం..
