రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్ ఖజానా’బయట పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు సీఎం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా’అని ఆయన అన్నారు. వేల మంది పోలీసుల ...
Read More »Tag Archives: Revanth Reddy
కేసీఆర్ పై సంచలన వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పలు సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఒక వైపు రాష్ట్రం అంతా కూడా మహమ్మారి కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం కనకవర్షం లో మునిగి తేలుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ తమ కుటుంబ సభ్యులకే అధికారాలు, వ్యాపారాలు అప్పగిస్తున్నారని, పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్కి ...
Read More »రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న రేవంత్రెడ్డి ఈ రోజు విడుదల కానున్నారు
Read More »రేవంత్రెడ్డి కి మేము మద్దతుగా ఉన్నాం-ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని తప్పుడు కేసులు బనాయించి రేవంత్రెడ్డిని వేధిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రేవంత్రెడ్డికి తామంతా పూర్తి మద్దతుగా ఉన్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై పోలీసులు ఏ మాత్రం ప్రాధాన్యం లేని, చిన్న చిన్న కేసులు పెట్టారన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి కలిసి ఎంపీగా రేవంత్ రెడ్డి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని వివరిస్తానని చెప్పారు. సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, మొత్తం వ్యవహారంపై విచారణ ...
Read More »రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కెమెరా కేసులో ఏ1 గా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఉప్పర్పల్లి కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. ఈ నెల 6న రేవంత్ బెయిల్ కోసం ఆయన తరుఫు న్యాయవాది పిటిషన్ వేశారు. నేటి విచారణ అనంతరం రేవంత్కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో లేదో వేచి చూడాలి.
Read More »హైకోర్టు ని ఆశ్రయించిన రేవంత్ రెడ్డి సోదరులు
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్ సోదరుల పిటిషన్పై విచారణ ...
Read More »సీఎంతో నాకు ప్రాణహాని ఉంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్
తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం తనకు 2+2 భద్రత కల్పిస్తున్నారని దాన్ని 4+4కు మార్చడంతో పాటు ఎస్కార్ట్ సదుపాయం కూడా కల్పించాలని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో కోరారు. దానికి బలమైన కారణాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మై హోం రామేశ్వరరావును కూడా జత చేస్తూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Read More »కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
కేసీఆర్.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్వా? చింతమడకు ఎంపీటీసీవా? ఆ రెండు గ్రామాల ప్రజల కోసమే పనిచేస్తావా? మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామస్థులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని, ఆయన సొంతూరు చింతమడకలో కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. వీటికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ...
Read More »కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని ఎన్నికల పథకంగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. రైతు సమన్వయ సమితి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నారు. ఎప్పటి నుంచి రైతులకు మద్దతు ధరలు ప్రకటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీని అమలు ...
Read More »కేటీఆర్, హరీశ్లకు ఐటీశాఖ నోటీసులు!
టీఆర్ఎస్కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ...
Read More »