గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం..

gachibouli-20.jpg

హైదరాబాద్​ గచ్చిబౌలి ప్రాంతంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దిఖీనగర్‌లో ఓ ఐదంతస్థుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. భవనంలో నివసించే వారు శబ్ధాలతో భవనం ఒరుగుతుండడం గమనించి బయటకు పరుగులు తీశారు. భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో నివసించే వారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల నివసించే వారందరినీ ఇళ్లు ఖాళీ చేయించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Share this post

scroll to top