కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..

uttam-16-.jpg

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని క్లారిటీ ఇచ్చారు. అంతేగాక రాష్ట్రంలో ఖాళీ అయిన రేషన్ డీలర్లను వెంటనే భర్తీ చేయాలని ఇదివరకే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియ వెంటనే జరుగుతుందని, అలా జరగని పక్షంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నయో తెలియపరిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

Share this post

scroll to top