గత ఏడాది బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును పెంచారు. ఈసారి కూడా దానిని పెంచడం గురించి చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిన తీరును బట్టి, కొన్ని ఆకర్షణీయమైన ప్రకటనలు వెలువడించారు. కొత్త పన్ను విధానంలో మధ్యతరగతి వారికి ఆదాయపు పన్నులో భారీ పొదుపు లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మధ్యతరగతి వారికి పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఇప్పుడు రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ప్రకటించారు.రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవ్వనున్నాయి. ఇతర పన్ను శ్లాబ్స్లో కూడా మార్పులు అవకాశం ఉంది. అలాగే వచ్చేవారం పార్లమెంట్ ముందకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డులు 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్పై పన్నుల తగ్గింపు అందజేస్తామన్నారు.