మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది. సింగపూర్లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం జరగడం ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో వెంటనే బయల్దేరాల్సిందిగా పవన్ కల్యాణ్ను కోరారట పార్టీ నేతలు, అధికారులు అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో కొంతవరకు కుదించారు. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు.
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు..
