దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదు..

harish-rao-08.jpg

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు మరోసారి విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం. పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది.

పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో ప్రతిభ చాటి ఏఈ, జెటీవోలుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.

Share this post

scroll to top