గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియో..

kavitha-28.jpg

ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. విద్యార్థులతో పని చేయించాలంటూ ఓ అధికారి ఆదేశిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు  ప్రతి నెల బీఆర్ఎస్  ప్రభుత్వం రూ.40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసే వారని కవిత పేర్కొన్నారు. వీరు టాయిలెట్లు,యు తరగతి గదులు శుభ్రం చేసేవారన్నారు. గతేడాది ఆగస్టునుండి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. దీంతో పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాల్సి వస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల లోని వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు.

Share this post

scroll to top