తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, రాత్రంతా ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అక్కడే ఉండి తీవ్ర అస్వస్థతకు గురై బాత్రూమ్లో కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో అప్రమత్తమైన ఫామ్హౌస్ సిబ్బంది హుటాహుటిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని అంబులెన్స్లో సోమాజిగూడ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం అక్కడ వైద్యులు ఎక్స్రే తీసిన తర్వాత కాలు విరిగినట్లు నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి బెడ్ రెస్ట్ అవసరమని తెలపడంతో ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ తో వెళ్లలేకపోయాడు. కాగా ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన తండ్రిని కలిసిన తర్వాత నేరుగా సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి కి చేరుకున్నారు. అనంతరం కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆమె పరామర్శించారు.