ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధ్వంసం నుండి వికాసానికి అనే నినాదంతో తన ప్రభుత్వ కీలక కార్యక్రమాలపై విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అంటూ వివరించారు.
తల్లికి వందనం పథకాన్ని అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారం రూపొందించినట్టు సీఎం తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. పథకం అమలులో ఇప్పటికే 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా లీగల్ గార్డియన్కు నిధులు మంజూరు చేస్తారని, అనాధ పిల్లల విషయంలో కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తల్లికి వందనం పథకానికి లబ్ధిదారుల జాబితాలు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తయ్యాక ఒకటి తరగతి నుండి ఈ నిధులు అందిస్తామన్నారు. అయితే ఈ రూ.15వేలలో పాఠశాల నిర్వహణ కోసం రూ. 1000, అలాగే మరుగుదొడ్ల నిర్వహణ నిధికి గాను రూ.1,000 చొప్పున కొత్త పెట్టి మిగిలిన రూ.13వేలు ఇచ్చేలా జిఓ విడుదల చేసింది. దీనితో ప్రతి ఒక్క విద్యార్థికి రూ.13వేల చొప్పున ఇవ్వబోతోంది.