మృత్యుంజయుడు రమేష్‌ను ప్రత్యేకంగా పలకరించిన మోడీ..

ramesh-13.jpg

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అందరూ చనిపోతే ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాపీగా బయటకు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో కూర్చున్నాడు. అతడే మృత్యుంజయుడు విశ్వాస్‌ కుమార్ రమేష్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించగా శుక్రవారం ప్రధాని మోడీ అతడి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. అతని దగ్గర నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మెడికల్ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా పలకరించి ధైర్యం చెప్పారు.

Share this post

scroll to top