శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్..

allu-arjun-07.jpg

సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్‏తోపాటు తెలంగాణ ఎఫ్‏డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి ఎప్పటికీ తాను అండగా ఉంటానని ఇదివరకే అల్లు అర్జున్ తెలిపారు. అలాగే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చెరో రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

Share this post

scroll to top