ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. 

rain-27.jpg

బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భరీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటకలో పూర్తిగా, మహారాష్ట్రలో ముంబైతో పాటుగా, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అస్సాం మేఘాలయ లోని కొన్ని ప్రాంతాలకు, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. మరాఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం దానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Share this post

scroll to top