పేరుకే పోలీస్ కానీ చేసేదేమో డ్రగ్స్ దందా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. బాపట్ల నుంచి హైదరాబాద్కు రూ.2 కోట్ల విలువ గల డ్రగ్స్ను తరలించారు ఏపీ కానిస్టేబుల్. ఈ విషయం తెలిసి ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ కానిస్టేబుల్ని తిరుపతికి చెందిన గుణశేఖర్ గా గుర్తించారు SOT పోలీసులు.
ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు..
