ఇటీవల జగన్ కు చెందిన మీడియాలో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, వారికి మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ పార్టీ అధినేత పర్యటనను ఓర్వలేకే టీడీపీ శ్రేణులు ఈ విధంగా దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు జగన్ పర్యటనలో భారీగా పోలీసులను మోహరించారు. దాడులు, ప్రతిదాడులు, పోలీసులకు గాయాలతో జగన్ పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడి..
