రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జూలై లోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ చివరివారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఆగస్టు రెండో వారం నాటికి ఎన్నికలను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. వీటన్నింటిపైనా ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్..
