విచారణకు హాజరైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే..

kowshik-17.jpg

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మాసబ్‌ ట్యాంక్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్‌ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్‌ రెడ్డిని మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడుతున్నారు. అయినా కూడా నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటాను. డిసెంబర్ 4న నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Share this post

scroll to top