తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి..

high-way-07.jpg

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. మరికొన్ని రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణలో రహదారులతోపాటు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

తెలంగాణలో 2,500 కి.మీ మేర జాతీయ రహదారులు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 2,500 కి.మీ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే రీజినల్‌ రింగ్‌ రోడ్డు కాకుండా, రూ. 12,619.27 కోట్ల అంచనా వ్యయంతో 691.52 కిలోమీటర్ల పొడవున 16 జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1,550.529 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 904.097 హెక్టార్ల భూమిని మాత్రమే సేకరించారు. మిగిలిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇదివరకే లేఖలు రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

Share this post

scroll to top