మాయ మాటలతో అధికారంలోకి వచ్చారు..

nani-12.jpg

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదనతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. అలాగే కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం చేసారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి మధ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులే ప్రధాన కారణమని నాని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి గోవర్ధన్, కొడాలి నాని, తాను ఇలా చాలా మంది నేతలపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని అన్నారు.

తనపై, తన భార్యపై కూడా రేషన్ బియ్యం కేసు పెట్టారని వివరించారు. మేము బాడుగకు ఇవ్వడానికి గోడౌన్లు నిర్మించాం. ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసిన వ్యక్తి తప్పు చేశాడు. బస్తాల తరలింపులో తేడా ఉందని చెప్పిన వెంటనే, తేడా వచ్చిన మొత్తం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్‌కి లేఖ ఇచ్చాం. అయినప్పటికీ, క్రిమినల్ కేసు పెట్టారని వివరించారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందంటూ కేసులు పెట్టినట్టు చెప్పారు. కోర్టు కూడా ఈ కేసులో ఫైన్ కట్టి విడిపించిపెట్టాలని చెప్పిందని నాని తెలిపారు. సివిల్ సప్లై చరిత్రలో ఇలా ఎవరి మీదా కేసులు లేవు, నాపై తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this post

scroll to top