మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్..

suresh-29.jpg

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది.  టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్‌ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

Share this post

scroll to top