ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ థామస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నీటి సంఘ చైర్మన్ ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ థామస్ ఈ సందర్భంగా లోకల్ లీడర్లకు కొందరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే నేను చెప్పినవే జరగాలని స్పష్టం చేశారు. ఇక్కడ, అక్కడ చిచ్చుపెట్టే నాయకులు జాగ్రత్త అలాంటి నాయకులు మళ్లీ తీరు మారలేదంటే తరిమి తరిమి కొడతాను అంటూ హెచ్చరించారు. తనకు చిచ్చుపెట్టే నాయకులు తెలుసు వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు.
ను చెప్పినవే జరగాలని స్పష్టం చేసిన ఎంవీ థామస్..
