తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. మూడు, నాలుగేళ్లలోగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు. వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్..
