దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తుది తీర్పు చెప్పింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 2016లోనే ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఇవాళ హైకోర్టు సమర్ధించింది. కాగా, 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్నగర్ జంట బాంబ్ పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
