తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. జిల్లాలో వందల సంఖ్యలో ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో ఓపెన్ ర్యాంపులు, బోట్స్ మెన్ సొసైటీ ర్యాంపులు ఉన్నాయి. కొందరు వ్యాపారులు వీటి నుంచి పెద్దమొత్తంలో ఇసుకను తవ్వతూ అక్రమంగా తరలిస్తున్నారు. ఓపెన్ ర్యాంపుల్లో అయితే అసలు ఎంత ఇసుక తవ్వుతున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారనే దానికి లెక్కా పత్రం లేకుండా పోతోంది. లారీలు, భారీ యంత్రాలు, పైగా డ్రెడ్జర్లను సైతం ఉపయోగించి ఇసుక తవ్వేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు..
