తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ఇళ్లు కేటాయించకుండా అర్హుల జాబితా నుంచి తొలగించారని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం శ్రీహరి పలువురికి ఇందిరమ్మ ఇల్లు కు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.
తమ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, తమకు ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ కన్నీరు పెట్టుకుంది. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో స్టేజీపై కడియం కాళ్లపై పడింది. మరొక వైపు ఇండ్లు, భూములు లేని నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలంటూ సమావేశం మధ్యలో పుంజూ రి రజిత, నాగరాజు దంపతులు ప్లెక్సీ పట్టుకు ని నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇల్లు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని, నాయకుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా ఇళ్ల జాబితాలో పేరు రాలేదని కడియం శ్రీహరికి చేతులెత్తి మొక్కారు. దీంతో పోలీసులు వారందరినీ బలవంతంగా అక్కడ నుంచి తీసుకపోయే ప్రయత్నంచేశారు. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేశారని, రెండో విడతలో మళ్లీ వస్తాయని కడియం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.