టాలీవుడ్ లో పాగా వేస్తున్న కన్నడ బ్యూటీ..

kanada-06.jpg

టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక ప్రెజెంట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకటిగా రాణిస్తోంది.

గతంలో ఎంతో మంది శాండిల్ వుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ రష్మిక క్రేజ్ డబులయ్యాక టాలీవుడ్ లక్కీగా మారిపోవడంతో క్యూ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్ క్రేజ్ తెచ్చుకుంటే  షరతులు వర్తిస్తాయి ఫేమ్ భూమి శెట్టి, వెయ్ దరువెయ్ హీరోయిన్ యషా శివ కుమార్ ఓకే అనిపించారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలు ఇచ్చిన ఇన్పిపిరేషన్ తోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్ వుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ సోయగం  తెలుగులో అడుగులు వేసేందుకు ప్రయత్నించి రెండు ఆఫర్లను దక్కించుకుంది.

Share this post

scroll to top