కాకాణికి నోటీసులు హిట్ లిస్టులో ఆరుగురు మాజీ మంత్రులు..

gowardhan-31.jpg

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల పైన విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక, భూ దందాలు చేసారనే ఆరోపణల్లో జగన్ కేబినెట్ లో పని చేసిన ఆరుగురు మంత్రులకు ఉచ్చు బిగిస్తోంది. వీరి పైన చర్యలు తీసుకోవాలంటూ రెవిన్యూ అధికారులు సీఎం కు నివేదిక ఇచ్చారు.

Share this post

scroll to top