సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం అని వచ్చి దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జి చేశారు పోలీసులు. ఇక ఈ పోలీసుల లాఠీ ఛార్జిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై BRS శ్రేణులు మండిపడుతున్నారు.
సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి..
