జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్..

ys-jagan-03.jpg

జాన్ విక్టర్ కుటుంబాని పరామర్శించారు వైఎస్ జగన్. ఈ ఘటన కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటన గల కారణాలను జాన్ విక్టర్ తల్లిదండ్రుల నుంచి అడిగి తెలుసుకున్నారు జగనన్న. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపుతప్పింది. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని తెలిపారు. ఏపీ పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం అని తెలిపారు. పోలీసులు ముగ్గురు యువకులను దారుణంగా కొట్టారన్నారు. పోలీసులే తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? అని నిలదీశారు. పరువు ప్రతిష్టలు తీసే హక్కు పోలీసులకు లేనే లేదని పేర్కొన్నారు.

Share this post

scroll to top