కృష్ణానది మీద ఎన్టీఆర్ జిల్లాలోని అనేక ఎత్తిపోతల పథకాలకు చాలీ చాలని నీరు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లకు శాలిచాలని నీరు రావడం వల్ల మోటార్లు సామర్థ్యానికి తగిన నీరు అందుబాటులో లేకపోవడం వల్లనే ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లు తరచూ రిపేరింగ్ వస్తున్నాయి. వీటి అన్నిటికీ ఏకైక పరిష్కారం మార్గం ఒకటే అదే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం. నిన్న హోటల్ ఐలాపురంలో సమావేశంలో సాగునీటి రంగంలో పనిచేసిన అనేకమంది ఇంజనీర్లు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం చేయకపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారు.
వైకుంఠపురం బ్యారేజీకి ప్రస్తుతం నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించే అక్షయపాత్ర అవుతుంది. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం గురించి త్వరలోనే ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులను కలవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమయం లో రాజకీయాలు పక్కన పెట్టి ఎన్టీఆర్ జిల్లాలోని రైతులు వ్యవసాయ కూలీలు మత్స్యకారులు యావత్తు ప్రజానికం కూడా వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం ఎందుకు జరగటం లేదు అనే దానిపైనే మేధావులు గొంతు ఎత్తి మాట్లాడవలసిన ఆవశ్యకత అవసరం ఏర్పడింది