మరో రెండు విడతల్లో 2 లక్షల వరకు రుణాలు..

ravanth-29.jpg

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 18న తొలి విడత రుణమాఫీని అమలు చేశారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. తొలి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 6 వేల కోట్ల నిధులు జమ చేశారు. మరో రెండు విడతల్లో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే లక్షన్నర లోపు రెండో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Share this post

scroll to top