నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం యూటర్న్‌..

high-court-09.jpg

గేమ్‌ ఛేంజర్ టికెట్‌ రేట్లపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ మేరకు అదనపు షోలు, షో టైమింగ్స్‌, ప్రేక్షకుల రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2తో కేసుతోపాటు విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. ఇటీవల పుష్ప 2 ది రూల్‌ సినిమా రిలీజ్‌ సమయంలో తొక్కిసలాట ఘటన నేపథ్‌యంలో ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్‌ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంటూ రామ్‌చరణ్‌ హీరోగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా బెనిఫిట్‌ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్‌ ధరల పెంపునకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Share this post

scroll to top