గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుండపోత వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటలకు 40 – 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని దీని వల్ల కుండపోత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల పజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్..
